9 April, 2026 | 7:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జాతర పనులను నిర్లక్ష్యం చేయొద్దు!

06-01-2026 01:15 AM

అధికారులపై హనుమకొండ కలెక్టర్ సీరియస్

కొత్తకొండ జాతరపై సమీక్ష 

భీమదేవరపల్లి, జనవరి 5 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షత్రమైన కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర మరో నాలుగు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో జాతర పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఆ గ్రామ సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేష్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న పనులపై ముల్కనూర్ ఎస్సు రాజు విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనంపె కలెక్టర్‌కు వివరించారు. రెండు రోజుల్లోగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న కందకాలను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు చొరవ తీసుకొని అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. కొత్తకోట గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్ రమ కలెక్టర్‌కు విన్నవించారు.