15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

డాక్టర్ దయాల్ సేవలు భేష్

30-01-2026 03:30 PM

కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): గత ఆగస్టు వరకు కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారిగా, నోడల్ అధికారిగా సమర్థవంతంగా, అత్యంత నిజాయితీగా విధులను నిర్వర్తించి రాష్ట్రస్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు సాధించిన క్రమంలో... రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగిత రాణా  ప్రత్యేక లేఖ ద్వారా దయాల్ సేవలను ప్రశంసించారు. అట్టి లేఖ ప్రతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశంలో దయాల్ కు అందజేశారు.

ప్రాథమిక విద్య పటిష్టతకై దయాల్ చేసిన అనేక సూచనలను ప్రభుత్వం గమనించడం గొప్ప విషయం అన్నారు. అందరూ దయాల్ అంకిత భావాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యా శాఖకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. దయాల్ నిస్వార్ధ అంకితభావ సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకుంటూ విద్యారంగాభివృద్ధికై ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలంటూ కలెక్టర్ పిలుపు నిచ్చారు.