26 March, 2026 | 12:22 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

దసరా ప్రత్యేక రైళ్లు

06-10-2024 12:37 AM

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన కాకినాడ టౌన్‌లో రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

ఈ నెల 7వ తేదీన సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకునేలా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో నల్గొండ, మిర్యాల గూడలో, ఏపీలోని గుంటూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నట్లు అధికారులు వెల్లడించారు.