22 June, 2026 | 1:30 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి: డివైఎఫ్ఐ

05-08-2025 05:37 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టితో తయారుచేసిన విగ్రహాలనే ప్రోత్సహించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, డి.తిరుపతి కోరారు. హనుమకొండ, రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఓపి)తో తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం కు హాని జరుగుతుందని, రసాయనాల వలన అవి తొందరగా నీటిలో కరగని, ఆక్సిజన్ స్థాయి తగ్గి నీటిలో జీవించే జీవరాశులకు హాని కలుగుతుందని నీరు కలుషితం అవుతుందని, చేపలు ఇతర జలచరాలు బతకడానికి ఇబ్బంది అవుతుంది.

నేల స్వభావం దెబ్బతింటుంది. పిఓపి పొడి గాలిలో కలవడం వలన  శ్వాస కోస సమస్యలు, చర్మవ్యాధులు వస్తాయని రాజస్థాన్ రాష్ట్రంలో తయారు అయిన పిఓపి కెమికల్స్ వలన భూమి, నీరు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, విగ్రహాల తయారీలో  వాటిని నిషేధించాలని కోరారు. గతంలో 2021 వ, సంవత్సరంలో హైకోర్టు పిఓపి విగ్రహాలు వాడొద్దని తీర్పు ఇచ్చిందని దాన్ని అమలు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టితో తయారుచేసిన విగ్రహాలనే వాడాలని, పర్యావరణ శాఖ, గ్రేటర్ మున్సిపాలిటీ అధికారులు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు.