22 June, 2026 | 2:33 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

బాన్సువాడ డివిజన్ కేంద్రంలో భారీ వర్షం

05-08-2025 05:32 PM

హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు వేసిన పంటలకు సాగునీరు లేక రైతులు ఆందోళనకు గురయ్యారు. నిజాంసాగర్ నీటిపైనే ఆధారపడిన రైతులు సాగుభూములు సాగు చేసుకుందామని ఇటు వర్షాలు లేక అటు నిజాం సాగర్ నీరు రాక రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతులకు మంగళవారం కురిసిన భారీ వర్షంతో కొంతమేర రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంటలు ఎండక ఈ వర్షపు నీటితోనైనా పంటలకు ఆగు నీరు రావడం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వాతావరణ శాఖ మరో రెండు మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగున్నాయని పేర్కొనడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.