05-05-2025 07:32:12 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పలుచోట్ల భూమి పది సెకండ్ల పాటు కంపించింది. మామడ, ఖానాపూర్, కడం, మండలాల్లో పలుచోట్ల భూమి కంపించిందని వదంతులు రాగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సుమారు 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని పలువురు ఇళ్లలోంచి బయటకు వచ్చి చర్చించుకోవడం జరిగింది. దీంతో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.