15 April, 2026 | 12:09 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్నికల సేవలకు ఈసీఐనెట్ యాప్

03-11-2025 03:05 AM

  40కి పైగా యాప్‌లను ఏకీకృతం చేసిన ఈసీ

ఓటరు నమోదు నుంచి ఫలితాల వరకు సమస్త సమాచారం ఒకే గొడుగు కింద

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): ఎన్నికల ప్రక్రియలో మరో డిజిటల్ విప్లవానికి భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు నమోదు, అభ్యర్థుల వివరాలు, ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి.. ఇలా ఎన్నికలకు సంబంధించిన సమస్త సేవలను, సమాచారాన్ని పౌరులకు ఒకేచోట అందుబాటులోకి తెస్తూ ఈసీఐనెట్ అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరించింది. ఇకపై పౌరులు, రాజకీయ పార్టీలు, అధికారులు వేర్వేరు యాప్‌లను, వెబ్‌సైట్లను వెతుక్కునే శ్రమకు ఈసీఐ శాశ్వతంగా తెరదించింది.

ఎన్నికల సంఘం ఇప్పటివరకు వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్న 40కి పైగా వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను ఏకీకృతం చేసి ‘ఈసీఐనెట్’ యాప్‌ను  రూపొందించింది. ఈ విశిష్టత కారణంగా దీనిని ‘మదర్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్‘గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒక్క యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఎన్నికలకు సం బంధించిన అన్ని సేవలు అరచేతిలోనే లభిస్తాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారం భమైన ఈ అప్లికేషన్ సేవలు, త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.