18 April, 2026 | 1:37 PM

జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

26-09-2024 01:44 AM

 పాపన్నపేట, సెప్టెంబర్ 25 : వరుసగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రసిద్ధ ఏడుపాయల దుర్గాభవానీ ఆలయం మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకున్నది. ఎగు వన ఉన్న సింగూరు ప్రాజెక్టు  నుంచి దిగువకు జలాలు విడుదల కావడంతో గర్భగుడి వరకు వరద చేరింది. దీంతో భక్తులు బుధవారం ఆలయానికి వచ్చి రాజగోపురం వద్దే దండం పెట్టుకుని వెనుదిరిగారు.