12 July, 2026 | 4:11 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

ఎనిమిది మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

02-11-2025 01:12 AM
  1. న్యాయవాదికి టోకరా

రూ.52 లక్షలు కొల్లగొట్టిన నిందితులు

రంగంలోకి పోలీస్ బృందాలు.. ముఠా ఆటకట్టు

అమరావతి, నవంబర్ 1: సైబర్ నేరాలకు అలవాటు పడిన నిందితులు ఇటీవల ఒక మహిళా న్యాయవాదికి టోకరా వేసి లక్షలు కాజేశారు. చివరకు కటకటాలపాలయ్యారు.  తెలిసిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ని ఏలూరు పట్టణానికి చెందిన ఓ మహిళా న్యాయవాదికి ఇటీవల ఒక కాల్ వచ్చింది. ‘అమెరికాలో ఉన్న మీ కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. మేం అడిగినంత సొమ్ము ఇస్తే తప్ప వారిని విడిచి పెట్టం’ అం టూ కాలర్ బెదిరించాడు.

అలా ఆమె నుంచి రూ.52 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఏలూరు పోలీసులకు ఫిర్యా దు చేయగా. మూడు బృందాలు రంగంలో కి దిగాయి. ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, మహారాష్ర్టను జల్లెడ పట్టి ఎనిమిది మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేశారు. సైబర్ నేరాల వెనుక కీలక సూత్రధారులు బంగ్లాదేశ్‌కు పారిపోయారని, వారి కోసం గాలిస్తు న్నామని పోలీసులు తెలిపారు. ఈ ముఠా దేశ దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ప్రాథమిక సమాచారం.