01-08-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూలై 31 (విజయ క్రాంతి): పారమిత పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు గురువారం ‘ఏక్ పేడ్ మా కే నామ్‘ అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లుల పేరు మీద మొక్కలు నాటి ప్రకృతి పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాద రావు మొక్కలు నాటిన విద్యార్థులను అభినందిస్తూ వా రు నాటిన ప్రతి మొక్క కూడా ఒక సజీవ జ్ఞాపకంగా నిలిచి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినింపాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్స్ ప్రసూన,అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు,రమణ, వి.యు.యం. ప్రసాద్, హన్మంత రావు, పాఠశాలల ప్రధానోపాద్యాయులు గోపీకృష్ణ, సమన్వ య కర్తలు నాగరాజు, రాము, రబీంద్ర పాత్రో, భవానీ, నిఖిత, విద్యార్థులుపాల్గొన్నారు.