9 April, 2026 | 10:44 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఏకాగ్రా ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీ

04-12-2025 12:32 AM
  1. 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహణ
  2. విజేతలకు భారీ ప్రైజ్‌మనీ

హైదరాబాద్, డిసెంబర్ 3 : తెలంగాణలో తొలిసారిగా భారీ ప్రైజ్‌మనీతో అతి పెద్ద ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఏకాగ్రా చెస్ అకాడమీ డిసెంబర్ 20, 21 తేదీల్లో హైదారాబాద్ హైటెక్స్ వేదికగా ఈ చెస్ టోర్నీని నిర్వహిస్తోంది.  వివరా లను టోర్నమెంట్ వైస్ ఛైర్మన్, నంది అవార్డ్ గ్రహీత షరీఫ్ మ హ్మద్ వెల్లడించారు. విజేతలకు రూ.22,22,222 నగదు బహుమతు లను అందజేయనున్నట్టు తెలిపారు.

సాధారణ ఆటగాళ్లకు ఎం ట్రీ ఫీజును రూ.5 వేలు గా నిర్ణయించారు. గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు, మహిళా జీఎం, డబ్ల్యూఐ ఎంలకు ఉచితంగా ఎంట్రీ ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఏకాగ్రా చెస్ అకాడమీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఏకాగ్ర చెస్ అకాడమీ ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్లేయర్స్ కు ట్రై నింగ్ ఇచ్చామని టోర్నమెంట్ డైరెక్టర్ గిరీశ్ రెడ్డి చెప్పారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని ఏకాగ్రా చెస్ స్కాలర్‌షిప్ కోసం ఎంపిక చేస్తామని తెలిపారు.