9 April, 2026 | 8:57 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

టీ20 ప్రపంచకప్‌కు భారత్ జెర్సీ ఆవిష్కరణ

04-12-2025 12:29 AM

రాయ్‌పూర్, డిసెంబర్ 3 : వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జ ట్టు ధరించే జెర్సీని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆవిష్కరించాడు. రాయ్‌పూర్ వన్డే బ్రేక్ టైమ్ లో ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసి డర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ చేతుల మీదు గా జెర్సీని విడుదల చేసారు. ఈ కార్యక్రమం లో యువ ఆటగాడు తిలక్ వర్మ, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జెర్సీ స్పాన్సర్ అపోలో టైర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారీ సైజ్ టీ20 ప్రపంచకప్ జెర్సీని గ్రౌండ్‌లో ప్రదర్శించారు. నీలిరంగులో ఉన్న జెర్సీ రెండు వైపులా ఆరెంజ్ ప్యానెల్స్, వర్టికల్ బ్లూ స్ట్రుప్స్ ఉన్నాయి. జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్న రోహిత్ 2024 టీ20 వరల్డ్ కప్ విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. తొలి వరల్డ్‌కప్ గెలిచాక మళ్లీ ట్రోఫీ అందుకోవడానికి సుధీర్ఘ కాలం వేచి చూడా ల్సి వచ్చిందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో మరోసారి టైటిల్ నిలబెట్టుకోవాలని ఆకాంక్షించాడు.