17 April, 2026 | 9:40 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

06-12-2025 05:56 PM

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..

నిర్మల్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పిఓ, ఎపిఓలు తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం మామడ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే పిఓ, ఎపిఓలకు శిక్షణ కార్యక్రమం కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పిఓల పాత్ర కీలకమని తెలిపారు.

మండలాలవారిగా పీఓలకు, ఎపిఓ లకు ఎన్నికల విధులపై శిక్షణ ఇస్తున్నామని వివరించారు. పిఓలు బాధ్యతాయుతంగా తమ విధులు పూర్తి చేయాలన్నారు. పీఓలకు ఎన్నికల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. అధికారులకు సమయపాలన, క్రమశిక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, డీఈఓ భోజన్న, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సుశీల్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.