7 May, 2026 | 3:14 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలక్టోరల్ కాలేజీ సిద్ధం

01-08-2025 12:00 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన

న్యూఢిల్లీ, జూలై 31: భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీ సిద్ధమైనట్టు పేర్కొం ది. ఈ మేరకు గురువారం ఈసీ ఒక ట్వీట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 (1) ప్రకారం భారత ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో పాటు నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది.

ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉభ య సభలు కలిపి 788 మంది సభ్యులు ఓ టింగ్‌లో పాల్గొననున్నారు. దీని ప్రకారం ఉ పరాష్ట్రపతి ఎన్నిక కోసం సంబంధిత సభలు రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాం తం ఆధారంగా అక్షరక్రమానుసారం ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్టు ఎన్నికల సం ఘం అసిస్టెంట్ డైరెక్టర్ అపూర్వ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

నోటిఫికేషన్ తేదీ వెలువడిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పా టు చేసిన కౌంటర్‌లో ఈ ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. త్వరలోనే ఎన్నిక నోటిఫికేషన్ జా రీ అవుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.