17-08-2025 10:58:26 PM
మునగాల,(విజయక్రాంతి): రాష్ట్ర విద్యుత్ సంస్థలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న 20వేల మంది కార్మికులను కన్వర్షన్ జేఎల్ఎం, ఎల్డిసి, సబ్ ఇంజనీరింగ్ చెయ్యాలని. టిజియుఇఇయు సిఐటియు అనుబంధo జిల్లా కార్యదర్శి కోటగిరి వెంకటనారాయణ మేనేజ్ మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఆదివారం సిఐటియు కార్యాలయంలో (టిజి యుఇఇయు) తెలంగాణ యూనైటేడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు అనుబంధ సంఘం 2వ మండల మహాసభ చందా సైదిరెడ్డి అధ్యక్షతనలో జరిగిన మహాసభలో ముఖ్యఅతిథిగా వెంకటనారాయణ పాల్గొని మాట్లాడుతూ... విద్యుత్ సంస్థలోని మీటర్ రీడర్స్ ను, బిల్ కలెక్టర్లకు నెలసరి వేతనాలు చెల్లించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, సైదిరెడ్డి, చిత్తలూరి నాగేశ్వరరావు, గోపయ్య, పాల్గొన్నారు.