17-08-2025 11:52:10 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం అమీరుద్దీన్ బాబా దర్గాలో శనివారం రాత్రి ఉర్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేసముద్రం (వీ) లో నిర్వహించిన సందళ్ ఊరేగింపులో కుల మతాలకతీతంగా భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఫాతియా కార్యక్రమాన్ని నిర్వహించి కావ్వాలి ఏర్పాటు చేశారు. ఉర్స్ వేడుకలకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఆదివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.