15 May, 2026 | 11:59 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

వేయి స్తంభాల ఆలయంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

21-09-2025 07:13 PM

హైదరాబాద్:  హన్మకొండ వేయి స్తంభాల ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు(Bathukamma Festival) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమయింది. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, సీతక్క హాజరయ్యారు. వేయి స్తంభాల ఆలయ ప్రాంగణం బతుకమ్మ ఆటపాటలతో మారుమ్రోగింది. మహిళలు బతుకమ్మలను తీరొక్క పూలతో అలంకరించి తీసుకొచ్చారు. మంత్రులు కొండ సురేఖ, సీతక్క బతుకమ్మ పాటలు పాడి అలరించారు.