8 June, 2026 | 6:22 PM

Breaking News

ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •  

ఏనుగుల సత్యనారాయణకు సన్మానం

04-01-2026 12:00 AM

హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసి యేషన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ పదవి విరమణ ఆత్మీయ అభినంద న సభ శనివారం ఖమ్మం జిల్లా టీజీవో అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి అధ్యక్షతన నిర్వ హించారు. సభ్యులు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ..

సత్యనారాయ ణ టీజీవో సంఘం వ్యవస్థాపన జరిగిన నాటి నుంచి ఎంతో క్రమశిక్షణతో కేంద్ర సం ఘాన్ని నడిపించారని తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాల నుండి ప్రాథమిక సభ్యులు వచ్చిన వారి సమస్యలను సాధనకై విశేష కృషి చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన లో టీజీవో చేసిన కృషిలో సత్యనారాయణ గారి పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

కేంద్ర సంఘ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్ అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్ గంగవరపు నరేందర్, హౌస్ బిల్లింగ్ సొసైటీ డాక్టర్ పి విజ య్ కుమార్, వెటర్నరీ గెజిటెడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన్యం రమేష్ బా బు, సం జయ్ రెడ్డి కార్యవర్గ సభ్యులు తమ్మిశెట్టి శ్రీనివాస్, ఎంపీఓ శాస్త్రి  అసోసియేట్ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసు, మెడికల్ ఫోరం బాధ్యు లు నరసింహారావు తదితరులు హాజరైనారు.