15 July, 2026 | 2:22 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు దోహదపడాలి

28-09-2025 05:13 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): పుట్టి పెరిగిన తమ గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండ రామారావు మాజీ ఎంపీటీసీ రేగటి రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగటి రవి, రేగటి వెంకటేష్, రేగటి రామకృష్ణ, రేగటి నాగరాజుల సహకారంతో మండల పరిధిలోని బండ రామారం గ్రామంలో వీధిలైట్లు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మేము పుట్టి పెరిగిన గ్రామ అభివృద్ధికి ఎంతో కొంత తనవంతుగా కృషి చేయాలనే లక్ష్యంతో గ్రామస్తుల సహకారంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతులు లక్ష్యంగా పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ద్వేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వీధిలైట్లు పంపిణీ చేసిన నాయకులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.