22 April, 2026 | 1:34 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

పరీక్షలు వాయిదా

29-08-2025 12:33 AM

ప్రకటించిన జేఎన్టీయూ, శాతవాహన, కాకతీయ వర్సిటీ

పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామన్న వర్సిటీలు

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. ఈమేరకు ఆయా వర్సిటీలు ప్రకటించాయి. ఈనెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూహెచ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురువారం, శుక్రవారం జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ అధికారులు ప్రకటించారు. అదేవిధంగా కరీంనగర్ శాతవాహన వర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మిగతా పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. అయితే వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రటిస్తామని ఆయా వర్సిటీలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి.