calender_icon.png 28 July, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పొడిగింపు

25-07-2025 12:13:11 AM

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. 12,055 ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగి ంచింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చేఏడాది మార్చి 31 వరకు వారి సేవలను పొడగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

సేవల పొడగింపు జరగకపోవడంతో సాంకేతిక కారణాలతో వారి జీతాలు ఆగిపోయాయి. జీవో జారీతో ఆ ఉద్యోగుల మూడు నెలల పెండింగ్ జీతాల ప్రాసెసింగ్ పూర్తుంది నిధులు ఆర్థిక శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు చేరాయి.