15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

20-11-2025 04:28 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దాయాదుల మధ్య భూ పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే అనుచరులు మధ్యవర్తిత్వం వహిస్తూ అడ్డుపడ్డారన్న ఆరోపణతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు  బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ అనే రైతు కు అదే మండలం వసంతాపూర్ గ్రామ శివారులో వారసత్వంగా వచ్చిన పొలంతో పాటు స్వయంగా కొనుగోలు చేసిన పట్టా పొలం నుండి 6 గుంటల భూమిని అవసరం నిమిత్తం అమ్ముకునేందుకు బేరం కుదుర్చుకున్నాడు.

అట్టి భూమిని అమ్ముకోనివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులుగా పేరు చెప్పుకుంటున్నకొందరు నేతలు అడ్డుకోవడంతో మనస్థాపం చెందాడు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి 108 సాయంతో జనరల్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.