31 May, 2026 | 9:53 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

రైతులు సంఘటితంగా మారాలి

25-12-2025 02:41 AM
  1. హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
  2. కరీంనగర్‌లో కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం

కరీంనగర్, డిసెంబరు 24 (విజయక్రాంతి): రైతులు సంఘటితంగా మారాలని, తద్వారానే వారి ఉత్పత్తులను వారు వస్తుమార్పిడి చేసి, అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ తెలిపారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. అనేక యం త్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రైతులు తమ భూములను భూసా ర పరిచయం చేసుకొని తగిన మోతాదులో ఎరువులు వాడటం వలన అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.  కిసాన్ జాగరణ అధ్యక్షుడు, కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకులు పొలసాని సుగుణాకర్‌రావు మాట్లాడుతూ.. గ్రా మీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందన్నారు.

కరీంనగర్ డెయిరీ 12 వేల సభ్యత్వంతో ప్రారంభమై ఈరోజు లక్షకు పైగా సభ్యులతో తెలంగాణలోనే అత్యధిక పాలు, పాల ఉత్పత్తులు వ్యాపారం చేసే సంస్థగా ఎదిగిందని కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు.  మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు,  మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.