10 April, 2026 | 4:43 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

08-11-2025 12:00 AM

బాచారం, బండ రావిరాలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ 

అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 7 (విజయ క్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అదనం కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. శుక్ర వారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలం లోని బాచారం, బండ రావిర్యాల పీసీసీ  సెంటర్ లను సందర్శించి, కొనసాగుతున్న వరి సేకరణ కార్యక్రమాలను ప్రత్యక్షంగా సమీక్షించారు.

తనిఖీ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగకుండా సేకరించిన వరిధాన్యాన్ని నిర్ణీత తేమ స్థాయికి చేరుకున్న వెంటనే రైస్ మిల్లులకు తరలించాలనీ, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని, మిల్లర్ రసీదులు సకాలంలో అందేలా చూడాలని, తద్వారా రైతులకు కొనుగోలు చేసిన 48 గంటలలోపే చెల్లింపులు జరగాలనీ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.

రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా చూసుకోవాలి అని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సకాలంలో మిల్లర్లకు పంపించాలని, తూకం వేసి మిషన్లు, గన్ని బ్యాగులను  టార్ఫాలిన్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లి లోని జయలక్ష్మి రైస్ మిల్లును తనిఖీ చేసారు. CSO వనజాత, ౄMO హరీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.