15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పాల బిల్లులు చెల్లించాలని రైతుల ధర్నా

26-12-2025 12:59 AM

ఆలేరు, డిసెంబర్ 25 (విజయక్రాంతి):  పెండింగు పాల బిల్లును వెంటనే చెల్లించాలని కోరుతూ ఆలేరు పాలశీతల కేంద్రం ముందు ఉమ్మడి నల్గొండ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం పలువురు రైతులు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలేరు, యాదగిరిగుట్ట మండలాలలో  పాల సంఘం చైర్మన్లు, పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పాల బిల్లుల బకాయిలు ఉండడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలని, లేదంటే రాజీనామా చేసేవరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా ఈ ధర్నాకు సిపిఎం జిల్లా నాయకులు ఇక్బాల్, బిజెపి నాయకులు నంద గంగేష్, కామిటికారి కృష్ణ మరియు వివిధ పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్ లు పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, పశుల సతీష్ రెడ్డి, మోటే  శంకర్, భూష శ్రీశైలం, ఊదరి రాములు, మైదం రంగయ్య, తీపిరెడ్డి సురేందర్ రెడ్డి, కృష్ణ, పారెల్లి నారాయణ, చిరబోయిన రాజయ్య మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.