15 June, 2026 | 11:14 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ముప్పనపల్లి సహాయ నిధి ఆధ్వర్యంలో కోమాలో ఉన్న చిన్నారికి ఆర్థిక సహాయం

01-10-2025 01:00 AM

వాజేడు, సెప్టెంబరు30 (విజయ క్రాంతి):ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెద్దగంగారం గ్రామానికి చెందిన మాజోజి నరేందర్ కూతురు(5 నెలలు) ఊపిరితిత్తుల సమస్య మరియు బ్రెయిన్ లో మచ్చలు వచ్చాయి,ప్రస్తుతం పాప పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది.

కోమాలో ఉంది 5లక్షల రూ. ఖర్చు  అవుతుందని ఖమ్మంలోని ప్రయివేట్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పినారు వాళ్లకు అంత ఖర్చు పెట్టుకునే స్థోమత లేకపోవడంతో పెద్ద మనసుతో దాతలు సహాయం చేసి మా పాపను కాపాడగలరని దీనస్థితిలో పాప తండ్రి వేడుకోగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న.

‘ముప్పనపల్లి సహాయం నిధి‘ఈ సహాయ నిధి దాతల సహాయంతో ఏంతో మంది కష్టాలను కడతేర్చిన గొప్ప సంస్థ అందుకే మంగళవారం రోజు ఖమ్మం ఓ హాస్పిటల్ లో ఉన్న పాప తండ్రి నరేందర్ కు 22వేల రూపాయలను ముప్పనపల్లి సహాయం నిధి వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.