15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం

22-12-2025 12:40 AM

మర్రిగూడ, డిసెంబర్ 21(విజయక్రాంతి): మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన మాధగోని వెంకటేష్ నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటివద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వెంకటేష్ తో పాటు  యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001_ 22 విద్యా సంవత్సరంలో పదోతరగతిని అభ్యసించిన విద్యార్థులు అందరూ కలిసి రూ. 74 వేల ఆర్థిక సహాయాన్ని ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పునూతల కృష్ణయ్య, రొక్కం మసూదన్ రెడ్డి, వెంకట్ బాబు, సిద్ధపురం జంగయ్య, వల్లముల శ్రీను, నారోజు రామాచారి, రమేష్, శ్రీను,కొండల్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.