17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఏకాదశి రోజున అన్న వితరణ

22-12-2025 12:43 AM

మఠంపల్లి, డిసెంబర్ 21(విజయక్రాంతి): మండలంలోని మట్టపల్లి గ్రామంలో ఉన్న సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ పుణ్య క్షేత్రంలో గల శ్రీ భక్త మార్కండేశ్వర అఖిల భారత పద్మశాలి నిత్యాన్నసత్రంలో సత్రం అధ్యక్షులు చిన్నం వీర మల్లు అధ్యక్షతన ఆదివారం సన్నాహక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి పర్వదినం నాడు పుణ్య క్షేత్రానికి దర్శించే పద్మశాలి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిసెంబర్ 29వ తేదీన సాయంత్రం,30వ తేదీన ఉదయం అన్న వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో సత్రం గౌరవ సలహాదారు రుద్ర కృష్ణ రావు, ప్రధాన కార్యదర్శి కొంగర నరసింహ రావు, కోశాధికారి దోనే చిన అంకయ్య,కార్య నిర్వాహక అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, ఉపా ధ్యక్షులు ఎ.రామ రావు, ఎ.వేణు, సహాయ కార్యదర్శి జి.రాజేష్ పాల్గొన్నారు.