15-11-2025 03:56:20 PM
చిట్యాల,(విజయక్రాంతి): మృతుడికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన అంతటి పారిజాత నరసింహ గౌడ్ వారికి శనివారం ఆర్థిక సహాయం అందజేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన గుంటోజు వీరయ్య అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశానుసారం వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి పారిజాత నరసింహ గౌడ్ 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.