15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మెసెంజర్ నాగమణికి ఆర్ధిక సహాయం

18-12-2025 12:33 AM

బూర్గంపాడు,డిసెంబర్ 17,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల విద్యావనరుల కేంద్రంలో నాగమణి  అటెండర్ గా గత 15 సంవత్సరాలు గా సర్వీస్ చేస్తున్నారు. గత నెలలో విధి నిర్వహణలో భాగంగా ఆఫీస్ కి వస్తున్న క్రమంలో దురదృష్టవశాత్తు ఆక్సిడెంట్ అయింది. బుధవారం టీఎస్ ఎస్ యు ఎస్ జిల్లా కమిటీ తరుపున మెసెంజర్ నాగమణికి రూ.31,000/- ఆర్ధిక సహాయం అందజేశారు.

మెసెంజర్ నాగమణి ని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ తరుపున  కోరారు.నాగమణి కి సహాయం చేసిన ప్రతీ ఒక్కరికీ జిల్లా కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చందు భట్టు,ప్రధాన కార్యదర్శి సిద్దు,మహిళా అధ్యక్షురాలు తులసి,నాయకులు మోహన్,రామకృష్ణ, కుమారి,నరేష్ పాల్గొన్నారు.