26-11-2025 12:00:00 AM
ఘట్ కేసర్, నవంబర్ 25 (విజయక్రాంతి) : శ్రీభవ్య రామమందిరంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేత ధర్మ ద్వాజ ఆరోహణ మహోత్సవ సందర్బంగా మంగళవారం ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిగూడ శ్రీదండ్లగడ్డ ప్రసన్నవీరాంజనేయ మల్లికార్జునస్వామి మందిరం ఆవరణలో ద్వాజ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, నాయకులు కొంతం అంజిరెడ్డి, మహేందర్, సంజీవరెడ్డి, రామతీర్థగౌడ్, సిద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.