calender_icon.png 29 August, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

404.50 అడుగులకు చేరిన కిన్నెరసాని ప్రాజెక్టు

28-08-2025 10:37:39 PM

ఒక గేటు ఎత్తి 5000 క్యూసెక్కుల నీరు విడుదల

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ మండల పరిధిలోని యానంబయలు వద్ద గల కిన్నెరసాని జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. గురువారం రాత్రి 8 గంటల వరకు జలాశయం నీటి మట్టం 404.50 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు. దీంతో  జన్కో అధికారులు ఒక గేటు అయిదు అడుగుల ఎత్తు ఎత్తి 5000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపుతున్నారు.