11-07-2025 06:54:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి శుక్రవారం వరద గెట్ ను ఎత్తివేశారు. ప్రాజెక్టు నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693 అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. కడెం ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో ముందస్తు జాగ్రత్తగా చర్యలు వీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 43 12 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారి తెలిపారు.