24 April, 2026 | 4:42 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

పాలనపై దృష్టి పెట్టండి

14-08-2024 12:30 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సమస్యకైనా కమిటీలను నియమించడం పరిపాటైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, ధరణి అవకతవకలు, కొత్త రేషన్ కార్డుల జారీ.. ఇలా ప్రతి దానికి మంత్రుల కమిటీలను నియమించడం ద్వారా సమస్యలపై కాలయాపన చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇంతకీ ఇన్ని కమిటీల్లో ఏ ఒక్క కమిటీ అయినా నివేదిక ఇచ్చిందా అంటే అదీ లేదు.

దీంతో కొత్త ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఒకటీ అరా తప్పించి, ఏ ఒక్క ముఖ్యహామీ అమలు కాలేదు. పింఛన్లు పెంచుతామన్న హామీ ఊసే లేదు. అలాగే, గృహలక్ష్మిపథకం అమలును మరిచారు. రాజకీయాలను కాస్త పక్కన పెట్టి పాలనపైన, ప్రజా సమస్యల పరిష్కారంపైన దృష్టి పెట్టాలి.

 రాజేశం గౌడ్, హనుమకొండ