23-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 22 (విజయక్రాంతి) : భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కుటుంబ సమేతంగా హాజరై పుష్కర స్నానం చేశారు. అనంతరం కాళేశ్వరుడిని, మహా సరస్వతి దేవిని సకుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.