calender_icon.png 2 January, 2026 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్, ప్రశాంత్ రెడ్డిని కలిసిన మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు

02-01-2026 12:00:00 AM

నిజాంసాగర్, జనవరి 1 (విజయ క్రాంతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురు వారం రోజు తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు టబీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం  బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని  దఫెదర్ రాజు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సంక్షిప్తంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా నాయకుల మధ్య ఆత్మీయ వాతావరణం నెలకొంది.