15 March, 2026 | 7:32 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎస్పీకి పూల మొక్క అందజేసిన ఎస్‌ఐ

02-01-2026 12:00 AM

ఎల్లారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి ఎస్‌ఐ బొజ్జ మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ... ప్రకృతి పచ్చదనానికి ప్రతీకగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర కు పూల మొక్కను అందజేసిన ఎస్‌ఐ బొజ్జ మహేష్. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

నూతన సంవత్సరంలో ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ, నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ నాయకత్వంలో పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.