15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఎస్పీకి పూల మొక్క అందజేసిన ఎస్‌ఐ

02-01-2026 12:00 AM

ఎల్లారెడ్డి, జనవరి 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి ఎస్‌ఐ బొజ్జ మహేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ కి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ... ప్రకృతి పచ్చదనానికి ప్రతీకగా ఎస్పీ యం. రాజేష్ చంద్ర కు పూల మొక్కను అందజేసిన ఎస్‌ఐ బొజ్జ మహేష్. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తున్నదని ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

నూతన సంవత్సరంలో ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ, నేర నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బొజ్జ మహేష్ మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ నాయకత్వంలో పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.