13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

నాలుగు రోజులు విద్యుత్ అంతరాయం

03-01-2026 12:00 AM

అశ్వారావుపేట, జనవరి 2(విజయ క్రాంతి) : రోడ్డు విస్తరణ పనులలో భాగంగా కొత్త కరెంటు టవర్స్ పై 33కెవి, 11కేవీ, LT విద్యుత్ తీగలు వేయడం జరిగినది. రోడ్డు కి ఇరువైపులా ఉన్న  పాత స్తంభాలు తీగలు తీసివేయడం  జరుగుతుంది కావున విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు. 

శనివారం నుండి మంగళవారం  అనగా 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు వినాయకపురం రోడ్ (పోలీస్ స్టేషన్ నుండి పెద్ద రైస్ మిల్), ఓల్ ఆంధ్రాబ్యాంక్ వీధి, దండబత్తుల బజార్, గాంధీ బొమ్మ సెంటర్,ముస్లిం బజార్,దూదేకుల బజార్, చిన్నంశెట్టి బజార్, తూర్పు బజార్, వడ్డెర బజార్, అంబేద్కర్ నగర్, గౌడ బజార్, తిరుమల నగర్, శివయ్య గారి బజార్,  గుర్రాల చెరువు రోడ్, రామాలయం బజార్, కొనరు బజార్ మరియు పెట్టామలపల్లి ప్రాంతాల్లో  ఉదయం 9గం నుండి మధ్యాహ్నం 3గం వరకు విద్యుత్ అంతరాయము కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు.