22 April, 2026 | 9:02 AM

డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు

28-07-2025 01:58 AM

సుందర్, జడేజా అజేయ సెంచరీలు

మాంచెస్టర్, జూలై 27: టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ నడుమ జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజైన ఆదివారం భారత బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్ (90), గిల్ (103)లకు తోడు, ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101*), రవీంద్ర జడేజా (107*) పోరాటపటిమతో ఓడిపోయే స్థితి నుంచి తేరుకున్న గిల్ బృందం చివరికి నాలుగో టెస్టును డ్రాగా ముగించింది.