07-08-2025 07:43:58 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): అంధత్వము నిర్ములించే బృహత్తర కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల, రామకృష్ణాపూర్, నస్పూర్ గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు ఆర్థికంగా వెనుకబడిన వారికోసం ఉచిత క్యాంపు నిర్వహింపచేసి కంటి చూపు లోపించి బాధపడుతున్న నలబై ఏడు మంది బీదవారికి ఆధునిక పరికరాలు, లయన్స్ రేకుర్తి కంటి ఆసుపత్రి యందు ఉచిత క్యాటరక్ట్ సర్జరీ చేసి, ఉచిత రవాణా, మందుల, అద్దాలు, భోజన సదుపాయాలు సమకూర్చి వారిని ఇంటికి పంపించడం జరిగిందని ఆసుపత్రి వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ తెలిపారు.