07-08-2025 10:11:55 PM
పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్త చైర్మన్ వంగవీటి రామారావు..
కోదాడ: విద్యార్థులు తల్లిదండ్రుల శ్రమను గుర్తించి బాగా చదువుకొని, జీవితంలో ఉన్నత స్థానాలను సాధించాలని పీసీసీ డెలిగేట్, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్త చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ కాలేజ్ బాయ్స్ క్యాంపస్(NRS College Boys Campus)లో జరిగిన ఫ్రెషర్స్ పార్టీలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు డేగ శ్రీధర్, కంభంపాటి శ్రీనివాస్, పిడతల శ్రీనివాస్, అకడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రావు, వైస్ ప్రిన్సిపాల్ జీ వీ తదితరులు పాల్గొన్నారు.