16 April, 2026 | 12:03 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

అనాధ బాబా శవానికి అంత్యక్రియలు

21-05-2025 08:09 PM

బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) సొనాల మండల కేంద్రంలోని ఋషి ఆశ్రమంలో బీహార్ రాష్ట్ర నుండి వచ్చిన గోతి రామ్ కిషోర్ త్యాగి బాబా గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నాడు. గత రెండు రోజులుగా తీవ్ర ఎండల ప్రభావంతో అస్వస్థకు గురయ్యాడు. భక్తులు స్పందించి వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బాబాకు నా అంటూ ఎవరూ లేకపోవడంతో భక్తులు దగ్గరుండి సోనాలలోనే సంప్రదాయబద్ధంగా అంతక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఋషి ఆశ్రమ భక్తులు అవనీష్ రాజు, సూరజ్, దశరథ్, సాయి, కిట్టు తదితరులు పాల్గొన్నారు.