16 April, 2026 | 12:07 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

దేశం కోసం అసువులు బాసిన అమరుడు రాజీవ్ గాంధీ

21-05-2025 08:11 PM

బోథ్ (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుడు, గొప్ప రాజకీయ వేత్త, భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని బోథ్ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగయ్య అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం బోథ్ మార్కెట్ యార్డులో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ప్రధానిగా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయాలే నేడు దేశాభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గొర్ల రాజు, అబుద్, భోజన్న, మహమ్మద్ శేఖర్ భోజన్న తదితరులు ఉన్నారు.