calender_icon.png 13 July, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాటరాయుళ్ల అరెస్టు

12-07-2025 08:32:38 PM

8 సెల్ ఫోన్లు, రూ 6,450.. సీజ్ 

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని తాడ్వాయి పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎస్సై మురళి పేకాట ఆడుతున్న ప్రదేశానికి వెళ్లి 8 మందిని పట్టుకొని వారి నుంచి 8 సెల్ ఫోన్లు రూ. 6,450 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న వారిలో ముసుకు సంగారెడ్డి, చెట్టే సాయిలు, బండి లింగం, ఆకిటి రాజిరెడ్డి, జావీద్ మరాటి గంగాధర్, నర్సింలు గంగారాములు ఉన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.