26-08-2025 01:35:20 AM
నిర్మల్ ఆగస్టు 25 (విజయక్రాంతి): ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు.
సోమవారం గణేష్ మండపాల నిర్వాహకులతో ఉత్సవాల నిర్వాణపై సమావేశం నిర్వహించారు. 11 రోజులపాటు నిర్వహించే ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు గణేష్ మండపాల నిర్వాకులు ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాకేష్ మీనా పోలీసులు పాల్గొన్నారు.