11 May, 2026 | 10:50 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

లక్ష్యాలను వంద శాతం సాధించాలి

17-08-2024 12:00 AM

బ్యాంకర్లకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన

వనపర్తి, ఆగస్టు 16 (విజయక్రాంతి): ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రాష్ట్ర ఆబ్కారి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి హాజరై మాట్లాడారు.

జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని, వ్యవసాయ రుణాలతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రుణ సదుపా యం ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలన్నారు. రుణమాఫీ అయిన రైతులను ఇబ్బంది పెట్టకుండా మళ్లీ రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్డీవో రిజర్వ్ బ్యాంక్ రెహమాన్, నాబార్డు ఏజీఎం మనోహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.