17 April, 2026 | 2:37 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

నీళ్లులేని ప్రాంతంలో గోదావరి జలాలు

26-12-2025 12:23 AM
  1. రైతుబంధు, 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్

మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 

సిద్దిపేట డిసెంబర్ 25 (విజయక్రాంతి): సాగునీటి సౌకర్యం లేని ప్రాంతానికి కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీరు 24 గంటల కరెంటు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోనీ వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావును కలిశారు.

ఈ సందర్భంగా గెలిచిన సర్పంచు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రైతు బంధు, 24 గంటల కరెంటు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ఐక్యతగా కృషి చేయాలని అవసరమైన నిధులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

సిద్దిపేట అర్బన్ మండలం, నంగునూరు మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచులు హరీష్ రావును కలవడంతో వారిని అభినందించారు. అనంతరం సిద్దిపేట అర్బన్ రెసిడెన్షియల్ విద్యార్థులకు బ్లాంకెట్స్ పంపిణీ చేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఐదు నెలలుగా కాస్మోటిక్స్, మెస్ చార్జీలు ఇవ్వడం లేదంటూ హరీష్ రావు విమర్శించారు. 

క్రిస్మస్ వేడుకల్లో... 

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సి ఎస్ ఐ చర్చి లో జరిగిన క్రిస్మస్ వేడుకలలో హరీష్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగగా క్రిస్మస్ పండుగను వర్ణించారు. ప్రజలందరూ ఐక్యమత్యంతో ఉండటానికి ఏసుక్రీస్తు చేసిన కృషిని ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు.