15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాష్ట్రస్థాయి కబడ్డీకి ఎంపికైన గోగు శేషు

17-12-2025 12:30 AM

సన్మానించిన మంత్రి సీతక్క

వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్16(విజయక్రాంతి):మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు శేషు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి సీతక్క ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా క్రీడాకారులు ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.

క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, ఈ నెల 25 నుంచి 27 వరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో గోగు శేషు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ చైర్మన్ పైడాకుల అశోక్, అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శి జనార్దన్, ఉపాధ్యక్షుడు కృష్ణ, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, అసోసియేషన్ బాధ్యుడు రాజయ్య, నవీన్, సీనియర్ క్రీడాకారుడు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.