15 June, 2026 | 10:57 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఉషు పోటీలలో బంగారు పతకం

27-09-2025 11:08 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో భగవతి విద్యార్ధి ప్రతిభ కనబరిచారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో స్థానిక భగవతి పాఠశాలలో పదవ  తరగతి చదువుతున్న కే. స్నితిక  అద్భుత ప్రతిభ కనబరచి మొదటి బహుమతిని మరియు బంగారు పథకాన్ని సాధించింది.

ఈ సందర్భంగా పాఠశాలల ఛైర్మన్ బి. రమణ రావు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... స్నితిక రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి అండర్ 17 విభాగంలో మొదటి బహుమతిని మరియు బంగారు పథకాన్ని గెలుచుకుందని తెలిపారు. పట్టుదల ఉన్నట్లయితే ఏదైనా సాధించవచ్చని, నేడు విద్యార్థులను కేవలం చదువులోనే కాకుండా ఆటల పోటీలలో కూడా ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రత్యేకంగా బంగారు పతకంతో సత్కరించారు.