15 June, 2026 | 9:46 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రెవెన్యూ కాలనీలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం

27-09-2025 11:11 PM

హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, జూలై వాడ బస్తీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రెవెన్యూ కాలనీ రామాలయంలో విజయ దశమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ విశ్రాంత అధికారి తక్కల్లపల్లి సోమేశ్వరరావు, ప్రధాన వక్తగా హిందూ జాగరణ మంచ్ అఖిల భారత సహ సంఘటన మంత్రి దేవేందర్ పాల్గొన్నారు. ప్రధాన వక్త దేవేందర్ జీ మాట్లాడుతూ సంఘటిత శక్తికి ప్రతీక విజయదశమి అన్నారు.

ధర్మ మార్గంలో నడుస్తున్న వారిని సo హరిస్తున్న రాక్షస శక్తిని అంతమొందించిన రోజే విజయ దశమి అన్నారు.ఆత్మవిస్మృతి చెందిన హిందూ సమాజాన్ని, అసంఘటితమైన హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి 1925 విజయదశమి రోజున నాగపూర్ లో డాక్టర్ హెడ్గేవార్ ఆర్.ఎస్.ఎస్ ను స్తాపించారన్నారు.ఈరోజు ప్రపంచంలోనే సంఘం ఒక వటవృక్షంలా ఎదిగి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదన్నారు. శాఖ అనే కార్య పద్ధతి ద్వారా ఆర్.ఎస్.ఎస్ గ్రామ, గ్రామాన, పట్టణాలలో, నగరాలలో,గిరిజన ప్రాంతాలలో వ్యాపించిందన్నారు.